సంబంధిత వార్తలు
- జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా..?
- సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే
- తప్పు అని తేలితే ముక్కు నేలకు రాస్తారా? ఈటల భార్య జమున ఓపెన్ చాలెంజ్
- ఇండియాలోనే ఆర్.ఆర్.ఆర్. అతి పెద్ద డీల్ అన్నపెన్ మూవీస్
- తౌటే తుపాన్.. ముంబై తీరంలో కొట్టుకుపోయిన నౌక.. 26మంది మృతి
వచ్చే పదేళ్ళకు ఉపయోగపడేలా విండోస్ 11 ఆవిష్కరణ
ప్రతి ఒక్క నెటిజన్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విండోస్ 11 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విండోస్ 11 సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ గురువారం ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10 విడుదలైన తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మరో ఆవిష్కరణ ఇదే.
విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. విండోస్ చరిత్రలో దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. రానున్న పదేళ్ల వరకు వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నట్టు చెప్పారు.
విండోస్ 11లో స్టార్ట్ మెనూ కొత్తగా ఉంటుందని అన్నారు. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. విండోస్ 11 ఓఎస్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్లను కూడా వినియోగించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందన్నారు.
ఈ ఏడాది చివరినాటికి కొత్త కంప్యూటర్లతోపాటు విండోస్ 10 వినియోగదారులకు కూడా ఈ సరికొత్త ఓఎస్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సత్య నాదెళ్ల తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని తెలిపారు.
తర్వాతి కథనం
