శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (13:26 IST)

ప్రేమికుడి బర్త్ డే పార్టీకి ఇంటికి గొళ్లెం పెట్టి వెళ్లింది.. చివరికి గ్యాంగ్ రేప్

నిర్భయలాంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మాయ మాటలు చెప్పి దారుణాలకు ఒడిగడుతున్నారు. ముంబైలో దారుణం జరిగింది.

బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి బర్త్​డే పార్టీకి వెళ్లిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్త్​ ముంబైలోని మల్వానీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్​ చేశారు.
 
వివరాల్లోకి వెళితే. నార్త్​ ముంబైలో జరిగిన ప్రియుడు పుట్టినరోజుకు యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెళ్లే సమయంలో తనను ఎవరూ అడ్డుకోకుండా ఇంటికి గొళ్లెం పెట్టింది. ప్రియుడి బర్త్​డే పార్టీకి చేరుకుంది. అక్కడ అతని స్నేహితులు, అతను కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. 
 
అనంతరం తనపై జరిగిన బలాత్కారం గురించి, నిందితుల గురించి వివరించింది. దీనిపై పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.