గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (12:17 IST)

22 ఏళ్ల యువతిపై రాపిడో బైక్ డ్రైవర్‌ సామూహిక అత్యాచారం

gang rape
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాదులో తోటి విద్యార్థులచేత పదవ తరగతి విద్యార్థిని సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవరక ముందే.. బెంగళూరులో మరో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాలికపై బైక్ సేవలను అద్దెకు తీసుకున్న తర్వాత రాపిడో బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించారు. 22 ఏళ్ల కేరళ యువతి మద్యం మత్తులో తన స్నేహితుడి ఇంటికి చేరుకోవడానికి రాపిడో బైక్ సర్వీస్‌ను అద్దెకు తీసుకుంది. 
 
కానీ, ర్యాపిడో డ్రైవర్ షహబుద్దీన్ ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి, ఆమె స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరి స్నేహితురాలు ఈ అకృత్యానికి సహకరించినట్లు సమాచారం. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరు నిందితులను, మహిళను అదుపులోకి తీసుకున్నారు.