1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (11:02 IST)

హర్యానాలో మహిళా రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపుర్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇది మరచిపోకముందే ఇపుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. హర్యానా సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ అన్నదాతలు 11 నెలల నుండి ఆందోళనలు చేపడుతున్నారు. 
 
ఢిల్లీ - హర్యానా బోర్డర్‌ టిక్రీకి సమీపంలో ముగ్గురు మహిళా రైతులపై నుండి వేగంగా ట్రక్కు దూసుకెళ్లడంతో వారు చనిపోయారు. ఆటో కోసం ఎదురుచూస్తూ డివైడర్‌పై కూర్చొగా ఆ ట్రక్కు వేగంగా వారుపైకి దూసుకువచ్చింది. 
 
వీరిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. ఒకరిని ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.