గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

హోలీ ఆడొద్దన్న అవ్వ... కర్రలతో చితక్కొట్టి చంపేసిన మనవడు.. ఎక్కడ?

హోలీ పండుగ రోజున ఓ ఇంట్లో విషాదకర సంఘటన జరిగింది. హోలీ పండుగ ఆడొద్దన్న అవ్వను కర్రలతో కొట్టి చంపేశాడో మనవడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. త‌న ఇంటి ముందు హోలీ ఆడొద్ద‌ని చెప్పినందుకు ఓ అవ్వ‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాది చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎత‌వా జిల్లా మేవ‌తి టోలా ఏరియాలో సోమ‌వారం జరిగింది.
 
ఓ 60 ఏళ్ల వృద్ధురాలు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జీవిస్తోంది. హోలీ పండుగ నేప‌థ్యంలో ఆ వృద్ధురాలి ఇంటి ముందు కొంద‌రు యువ‌కులు హోలీ ఆడారు. త‌న ఇంటి ముందు హోలీ ఆడొద్దు అని ఆ యువ‌కుల‌ను ముస‌లావిడ ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువ‌కులు వృద్ధురాలితో పాటు కుటుంబ స‌భ్యుల‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేశారు.
 
వారి దాడిలో వృద్ధురాలి చ‌నిపోయింది. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దాడికి పాల్ప‌డ్డ యువ‌కులంద‌రూ మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
 
ఏక్డిల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న మ‌రో యువ‌కుడు.. ట్రాక్ట‌ర్‌ను అతివేగంగా న‌డ‌ప‌డంతో పాద‌చారుల‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో ట్రాక్ట‌ర్ కూడా ధ్వంస‌మైంది. ట్రాక్ట‌ర్‌ను న‌డిపిన యువ‌కుడిని స్థానికులు పోలీసుల‌కు అప్ప‌గించారు.