సంబంధిత వార్తలు
- ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వరా? ఆపిల్ సంస్థకు షాక్.. రూ.15కోట్లు ఫైన్
- బ్రెజిల్లో కరోనా విజృంభణ.. రోజుకు 90,303 కేసులు.. రోజుకు 2,648 మంది మృతి
- బ్రెజిల్లో కోవిడ్ వైరస్.. రోజుకు 2వేల మంది మృతి
- బ్రెజిల్లో కరోనా విజృంభణ.. 424 గంటల్లో 21,641 మంది మృతి
- ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. 6552 పోస్టులు ఖాళీ.. క్లర్క్లు, స్టెనోగ్రాఫర్స్ కావలెను
బ్రెజిల్లో ఒక్కరోజే 3,251 మంది మృత్యువాత
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి బ్రెజిల్లో మరణ మృదంగం మోగిస్తోంది. ఆ దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం ఒక్కరోజే 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్కు బలయ్యారు. మరోవైపు రోజువారి కరోనా కేసులు 84 వేలకుపైగా నమోదయ్యాయి.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరుకోగా.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా, కరోనా కట్టడిలో వైఫల్యం కావడంతో ఆరోగ్యశాఖ మంత్రిని ఆ దేశాధ్యక్షుడు బోల్సోనారో తొలగించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ విధించకపోవడం వల్లే కేసులు పెరిగినట్లు ఆ దేశ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి.
