గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (19:41 IST)

పెళ్లికాని మహిళా టీచర్లు, ప్రొఫెసర్లే టార్గెట్, లొంగదీసుకుని...

అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పెళ్ళి కాని ఉపాధ్యాయురాళ్లు, అలాగే లేడీ ప్రొఫెసర్ల మీదే ఇతను కన్ను ఉంటుంది. మాయమాటలతో వారికి బాగా దగ్గరవుతాడు. వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. బోర్ కొడితే వదిలేస్తుంటాడు. ఇలా కొంతమందిని వాడుకుని వదిలేసిన ఆ ఉపాధ్యాయుడు ఒక్క మహిళ కారణంగా అడ్డంగా దొరికిపోయాడు.
 
చెన్నైలోని శివారు ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో లేడీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనిత దారుణ హత్యకు గురైంది. రెండురోజుల క్రితం ఘటన జరిగితే పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
 
అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుర్తించారు. అతని పేరు సుధాకర్. పెళ్ళి కాని టీచర్లు, అలాగే లేడీ ప్రొఫెసర్లతోనే ఇతను రాసలీలలు సాగిస్తుంటాడని తెలుసుకున్నారు. నిందితుడిని అతి చాకచక్యంగా పట్టుకున్నారు.
 
అనితకు కూడా మాయమాటలు చెప్పి లోబరుకున్నానని.. అయితే ఆమె పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో చంపేశానని ఒప్పుకున్నాడు సుధాకర్. కాగా అనితకు వచ్చే నెల వివాహం నిశ్చయించారు పెద్దలు. అయితే ఇంతలో ఆమె దారుణంగా హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.