శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (17:34 IST)

ఎయిర్ హోస్టెస్‌పై ఇంటికెళ్లి అత్యాచారం.. ఆమె ఏం చేసిందో తెలుసా?

దేశ రాజధాని నగరం ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. వయోబేధాలే కాదు.. లింగ బేధాలు లేకుండా ఢిల్లీలో అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయి. నిన్నటికి నిన్న ఓ బాలుడిపై నిర్భయ తరహా సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 
 
తాజాగా ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం జరిగింది. అయితే తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఆ ఎయిర్ హోస్టెస్ చుక్కలు చూపించింది. తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ధైర్యంగా బంధించి పోలీసులకు పట్టించింది. 
 
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు హర్ జిత్ యాదవ్ బాధితురాలికి నెలన్నర పాటు పరిచయం. ఈ పరిచయంతో అతడితో స్నేహం చేసిన బాధితురాలిపై ఆదివారం మత్తుపదార్థాలు సేవించి సదరు ఎయిర్ హోస్టెస్ ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆమె ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా నిందితుడిని బంధించి సాయం కోసం 112 కాల్ చేసి పోలీసులకు అప్పగించింది. ఇంకా బాధితురాలి వాంగ్మూలం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తరలించారు.