1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (15:12 IST)

కర్నాటకలో మళ్లీ రాజుకున్న హిజాబ్ వివాదం

కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం ఒక్కసారి దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడిందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, పరిస్థితి మరోమారు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తుంది. యూనివర్శిటీలలో ప్రీఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. దీంతో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 
 
కర్నాటక హైకోర్టు మార్చి 15వ తేదీన ఇచ్చిన తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు. వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఉన్నారు. 
 
వీరంతా తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలో కూడా ప్రాక్టికల్ పరీక్షలను కూడా బహిష్కరించారు. ఇపుడు కూడా ప్రీ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌ను రాయకూడని నిర్ణయించుకున్న నేపథ్యంలో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది.