ఆదివారం, 14 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2025 (23:21 IST)

అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌కు 60 చెంపదెబ్బలు- వీడియో వైరల్

Law Student
Law Student
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌పై దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 60 చెంపదెబ్బలు కొట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు పాల్పడిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే, లక్నో అమిటీ క్యాంపస్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న షికార్ ముఖేశ్ కేసర్వానీపై ఆగస్టు 26న యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో ఈ దాడి జరిగింది. 
 
ఇటీవలే కాలికి లిగమెంట్ సర్జరీ చేయించుకున్న షికార్, ఊతకర్రల సాయంతో నడుస్తుండగా అతనిపై దాడికి పాల్పడ్డారు.  ఇద్దరు అమ్మాయిల గురించి షికార్ అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడి తండ్రి ముఖేశ్ కేసర్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.