శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (13:12 IST)

'భార్య తెలివైనదైతే ఎన్ని కష్టాలో' : ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు సంస్థల అధిపతి. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. దీనికి నిదర్శనం ఆయన ట్విట్టర్ ఖాతాను దాదాపు 60 లక్షల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ఆసక్తికర అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ఒక్కోసందర్భంలో ఆయన చేసే ట్వీట్లు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా, తాను చదివిన ఓ వార్తను పట్టుకుని భార్య తెలివైనదైతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో... అంటూ తన భార్యను ఆట పట్టించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 62 యేళ్ల వ్యక్తి ఒకరు.. తన భార్య చెప్పే మాటలు వినాల్సి వస్తుదని భావించి వెవిటివానిగా, మాటలురాని మూగవాడిగా నటించాడు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇటీవల పత్రికల్లో వచ్చింది. ఈ వార్త ఆనంద్ మహీంద్రా కంటపడింది. దాన్ని చదవగానే ఆయన కడుపుబ్బ నవ్వారు. అంతటితో ఆగకుండా తన భార్య అనురాధ వద్ద ప్రస్తావించాడు. 
 
'నేను కూడా నిన్ను ఇలాగే ఫూల్ చేస్తే ఏం చేస్తావ్' అంటూ సరదాగా ప్రశ్నించారు. 'నిజమా... సెల్‌ఫోన్‌లో మాట్లాడకుండా మీరు ఐదు నిమిషాలైనా ఉండగలరా?' అని భార్య అనురాధ అడిగారట. దాంతో ఆయన "తెలివైన  భార్య ఉంటే ఎన్ని ప్రమాదాలో" అని తమ మధ్య జరిగిన సంభాషణను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇక ఇది వైరల్ అవుతోంది. దీనికి వేల సంఖ్యలో లైక్స్, షేర్లు వచ్చాయి.