ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (14:04 IST)

దోపిడీకి వెళ్లి.. మహిళపై అత్యాచారం చేశాడు..

మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) బెంగళూరులోని ఓ ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ డబ్బు సరిపోక రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ మహిళ ఇంట్లో దొంగతానికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. దీన్ని అదనుగా తీసుకుని.. దేవరాజ్ ఒంటరి మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దేవరాజ్‌పై ఆరు కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు.