ఈవ్ టీజింగ్.. ఫోన్ కాల్స్తో వేధింపులు.. 17ఏళ్ల బాలిక ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఒక బాలుడు నిరంతరం ఈవ్ టీజింగ్ చేయడంతో మనస్తాపం చెందిన 12వ తరగతి విద్యార్థిని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని సోమవారం పోలీసులు తెలిపారు. మౌధా ప్రాంతంలో నివసిస్తున్న 17 ఏళ్ల బాలిక సోమవారం తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.
సమాచారం మేరకు, మౌధ కొత్వాలి పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఒక బాలుడు ఆమెను నిత్యం ఆటపట్టించేవాడని.. గ్రామస్తులు తెలిపారు. అతను ఆమెకు మొబైల్ ఫోన్కు కాల్ చేసి వేధిస్తున్నాడని ఆరోపించారు.
పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో ఆ అమ్మాయి విసుగు చెందిందని గ్రామస్తులు తెలిపారు. ఆ అమ్మాయి ఇటీవల కాన్పూర్లో నివసించే తన మామ కూతురికి ఈ విషయం చెప్పి, తనను కాపాడమని కోరింది. ఆ అబ్బాయి తనను వేధించడం ఆపకపోతే తాను ఏదైనా కఠినమైన చర్య తీసుకోవలసి వస్తుందని ఆమె తన బంధువుతో కూడా చెప్పినట్లు దర్యాప్తులో తేలింది.