1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (10:24 IST)

క్రైమ్ సిరీస్ చూసి భర్తను... ప్రేమికుడితో కలిసి చంపేసింది..

crime scene
క్రైమ్ సిరీస్ చూసి భర్తను ఓ భార్య ప్రేమికుడితో కలిసి హత్య చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌కు చెందిన కళ్యాణ్‌పూర్‌లోని శివలీ రోడ్డులో రిషబ్ తివారీ (29) తన భార్య సప్నాతో కలిసి నివసించాడు.
 
నవంబర్ 27న తన స్నేహితుడు మనీష్‌తో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చకర్‌పూర్ గ్రామానికి స్కూటీపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా చకర్పూర్ గ్రామ సమీపంలో అకస్మాత్తుగా దాడి జరిగింది. ఈ ఘటనతో గాయాలపాలైన అతడు స్వరూపనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
రిషబ్ పరిస్థితి మెరుగుపడటంతో డిసెంబర్ 1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే డిసెంబర్ 3న రిషబ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆపై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కృష్ణానగర్ వాసి రాజు గుప్తాతో సప్నా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిసింది. రిషభ్ పేరు మీద చాలా పెద్ద ఆస్తులున్నాయి. దోచుకోవడానికి ఈ ఇద్దరు కుట్ర పన్నారు. కుట్రలో భాగంగా రాజు తన సహచరుడు సితుతో కలిసి నవంబర్ 27న రిషబ్‌పై దాడి చేశాడు.
 
ఈ దాడిలో అతను గాయపడ్డాడు, కానీ అతని ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు, అతని భార్య సప్నా అతనికి ఓవర్ డోస్ మందులు ఇస్తూనే ఉంది. దీంతో రిషబ్ ఆరోగ్యం క్షీణించి మరణించాడు. ఈ కేసులో నిందితులు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ చాట్ హంతకులను బట్టబయలు చేసింది.