శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (09:52 IST)

ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చిన భార్య... తర్వాత ఏమైంది?

murder
ముంబైలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య తన భర్తను హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి అడ్డు లేకుండా చేసుకుంది. చివరకు మృతుడి బంధువులు అనుమానించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో  ఆమె, ఆమె ప్రియుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
 
ముంబై శాంతాక్రజ్ ప్రాంతానికి చెందిన కవతి - కమల్ కాంత్ అనే దంపతులు ఉన్నారు. భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా కొంతకాలంగా ఉంటూ వచ్చింది. అయితే పిల్లల భవిష్యత్ దృష్ట్యా భర్త వద్దకు మళ్లీ వచ్చింది. ఇదిలావుంటే, కమల్ కాంత్ - హితేశ్ జైన్‌లు బాల్య స్నేహితులు. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేసేవారు. 
 
ఈ క్రమంలో కవితకు హితేశ్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఇంతలో అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, కమల్ కాంత్‌కు జరిగిన వివిధ వైద్య పరీక్షల్లో రక్తంలో ఆర్సెనిక్, థాలియంలు సాధారణ స్థాయి కంటే అధిక మోతాదులో ఉన్నట్టు తేల్చారు. పైగా, మానవ శరీరంలో ఇలాంటి లోహాలు చేరడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీన కమల్ కాంత్ చనిపోయారు. దీంతో పోలీసులు తొలుత ఆకస్మిక మరణంగా నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
అయితే, కమల్ కాంత్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ మృతిలో ఏదో కుట్ర కోణం దాగివుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకునేందుకు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసినట్టు కవిత పోలీసలకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడు హితేశ్‌ను అరెస్టు చేశారు.