గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (09:39 IST)

మంత్రి శ్రీనివాస్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడు ఆత్మహత్య

suicide
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం... పాలమూరులోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్నారు. 
 
ఆయన కుమారుడు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం రావడంతో పది రోజుల క్రితం ఆయన పది రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఆయన తన మేనమామ గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో నవీన్ ఊరికి వెళ్లి.. సోమవారం ఉదయం ఊరి నుంచి వచ్చారు. అయితే, ఫ్లాట్ తలుపులు మూసి ఉండటంతో తలుపు కొట్టినప్పటికీ ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఆయన తన వద్ద ఉన్న ఇంకో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లాడు. పడక గదిలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అక్షయ్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందికి దించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొకరలేదని పోలీసులు వెల్డలించారు. కాగా పాలమూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అనేక మంది నుంచి ఆయన డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో పాటు పలువురు ఫిర్యాదు కూడా చేశారు. 
 
దీంతో సెప్టెంబరు 30వ తేదీన అక్షయ్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వా బెయిల్‌పై బయటకు వచ్చిన అక్షయ్ హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నారు. అరెస్టు కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు.