1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:50 IST)

కరోనా కట్టడికి ఢిల్లీలో పంచసూత్రాల ప్రణాళిక

కరోనా కట్టడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంచసూత్రాల ప్రణాళిక (5టీ ప్లాన్‌) ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...5టీ ప్లాన్‌ గురించి వివరించారు.

టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, టీమ్‌ వర్క్‌, ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ అనేదే 5 టీ ప్లాన్‌ అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 12 వేల హోటల్‌ గదులను అద్దెకు తీసుకుని క్యారంటైన్‌ కేంద్రాలుగా మార్చబోతున్నామని చెప్పారు.

8 వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.