1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 18 మే 2015 (18:04 IST)

జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ప్రమాణ స్వీకారం!

జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, జార్ఖండ్ గవర్నర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేత జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్ ప్రమాణం చేయించారు. 
 
ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం రఘువర్ దాస్, మాజీ సీఎంలు శిబు సోరెన్, అర్జున్ ముండాలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆమెను ప్రధాని మోడీ సర్కారు గవర్నర్‌గా నియమించారు.