1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (14:06 IST)

లిక్కర్ స్కామ్ కేసు.. జూలై 3వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Kalvakuntla kavita
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం జూలై 3 వరకు పొడిగించింది. కవితపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కవితను కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టడీని పొడిగించారు.

మే 29న ఈ కేసులో బీఆర్‌ఎస్‌ నాయకుడిపై చార్జిషీట్‌ను స్వీకరించిన తర్వాత కోర్టు వారెంట్లు జారీ చేసింది. ముగ్గురు సహ నిందితులు - ప్రిన్స్, దామోదర్, అరవింద్ సింగ్‌లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 
ఈడీ విచారణలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండా చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
 
 2021-22 కోసం ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి కవిత (46)ని అరెస్ట్ చేసిన ఈడీ.. తీహార్ జైలు నుంచి సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది.