1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 మే 2020 (21:06 IST)

ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు ఐదేళ్ల బుడ్డోడు

పాలబుగ్గల పసితనం ఇంకా వీడని ఐదేళ్ల బుజ్జాయి ఈ రోజు బెంగళూరు విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒంటరిగా విమానం దిగుతుంటే చుట్టుపక్కల వాళ్ల నోళ్లు వెళ్లిబెట్టి చూశాడు.

స్పెషల్ కేటగిరీ కింద బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా జర్నీ చేశాడు. బెంగళూరుకు చెందిన విహాన్ శర్మ అనే పిల్లాడు లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. లాక్‌డౌన్ వల్ల తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు.

తల్లిదండ్రులపై బెంగతో రోజులు వెళ్లదీశాడు. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో విహాన్ ప్రయాణానికి బంధువులు ఏర్పాట్లు చేశాడు. బుడ్డోడికి మాస్కు, ప్లాస్టిక్ షీల్డ్ గ్లవుజులు తొడిగి భద్రంగా స్పెషల్ కేటగిరీ కింది విమానం ఎక్కించారు.

సిబ్బంది వాడికి సీట్ బెల్ట్ తగిలించి మరింత జాగ్రత్తగా చూసుకున్నారు. విమానం బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.

వాడి కోసం కళ్ల కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తల్లి బిడ్డ కనిపించగానే ఒడిలోకి తీసుకుంది. విహాన్ మీడియాకు స్పెషల్ కేటగిరీ బోర్డు చూపెడుతూ మరింత సందడి చేశాడు.