1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (09:54 IST)

ఆ హోటల్‌లో భోజనం చేస్తే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫ్రీ...

పూణెలోని ఓల్డ్‌ ముంబై - పూణె హైవేపై వడ్‌గావ్‌ మవల్‌ అనే ప్రాంతంలో హోటల్‌ శివరాజ్‌ ఉంది. అక్కడ బుల్లెట్‌ థాలి పేరిట ఓ ప్రత్యేకమైన భోజనం లభిస్తుంది. దాని ధర రూ. 2.500. ఆ భోజనాన్ని కనీసం ఏడుగురు తినవచ్చు.

అందులో ఫిష్‌, ఫ్రాన్స్‌, మటన్‌, చికెన్‌ తదితర 12 రకాల డిషెస్‌ ఉంటాయి. అయితే ఆ భోజనాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి 60 నిమిషాల్లో.. అంటే ఒక గంటలో తినాలి. అది కూడా కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా.. ఇచ్చిన టైమ్‌ లిమిట్‌లోనే ఏమీ మిగల్చకుండా పూర్తిగా తినేసేయాలి. ఇలా తింటే రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని బహుమతిగా ఇస్తారు. ఇలా బహుమతిగా ఇచ్చే బైక్స్‌ను షాపులోనే డిస్‌ప్లేకు ఉంచుతున్నారు.

ఇప్పటివరకు ఈ ఆఫర్‌ను చాలామంది స్వీకరించారు. కానీ కేవలం ఒకేఒక్క వ్యక్తి మాత్రమే ఇప్పటివరకు ఆ భోజనాన్ని గంటలో తిని బైక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ మళ్లీ విన్నర్‌ కాలేకపోయారు. కరోనా నేపథ్యంలో బిజినెస్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ హోటల్‌ ఇంత ఖరీదైన ఆఫర్‌ను ప్రకటించిందట.