1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (10:32 IST)

ఈ రోజు దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎన్ని?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఈ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటికే 20 వేల దిగువకుపడిపోయిన ఈ కేసులు... గడిచిన 24 గంటల్లో 14 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 13405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 235 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,12,344కు చేరుకుంది. 
 
ఇకపోతే, 34,226 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయిు.