1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Jagananna Vidya Deevena Funds Release Today

జగనన్న విద్యా దీవెన : రూ.709 కోట్లు జమ

Jagananna Vidya Deevena
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం జగన్న విద్యా దీవెన. ఈ పథకం కింద బుధవారం మరో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. అక్టోబరు - డిసెంబరు 2021 త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్ని, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే ఈ నిధులను జమ చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించడం గమనార్హం. ఇపుడు జగన్ ఒక్క త్రైమాసికానికే రూ.709 కోట్లు చెల్లించనుంది. 
తర్వాతి కథనం
ప్రియుడు వదిలేశాడు.. గర్భవతి అని చెప్పినా రాలేదు.. నిప్పంటించుకుని..?