1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (10:28 IST)

యువకుడితో రాత్రంతా ఎంజాయ్ చేసింది.. తెల్లారగానే డబ్బివ్వాలని బ్లాక్‌మెయిల్ చేసిన యువతి

రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును అనే జిల్లాకు చెందిన ఓ యువతి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. 19 ఏళ్ల పీజీ కళాశాల విద్యార్థిని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి... పోలీసులకు చిక్కింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివ

రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును అనే జిల్లాకు చెందిన ఓ యువతి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. 19 ఏళ్ల పీజీ కళాశాల విద్యార్థిని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి... పోలీసులకు చిక్కింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుర్గావ్‌కు చెందిన ఓ యువకుడు ఈ నెల 8వ తేదీన జైపూర్ పర్యటనకు వచ్చి.. అక్కడే ఓ గదిని తీసుకుని నివశిస్తూ వచ్చాడు. ఈ యువకుడితో లాల్ కోఠిలోని హాస్టల్‌లో ఉండే 19 ఏళ్ల పీజీ కళాశాల విద్యార్థిని పరిచయం పెంచుకుంది. ఓ రోజు రాత్రంతా ఎంజాయ్ చేద్దామంటూ యువకుడికి మాయమాటలు చెప్పింది. దీనికి సమ్మతించడంతో ఇద్దరూ గదిలోనే ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తెల్లారగానే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేసింది. 
 
పోలీసు కేసుకు భయపడిన ఆ బాధిత యువకుడు యువతి అడిగిన విధంగా డబ్బు ఇచ్చి, భవిష్యత్‌లో ఎలాంటి సమస్యా లేకుండా షరతుతో అఫిడవిట్‌పై యువతి సంతకం తీసుకున్నాడు. అయితే, మరోసారి రూ.18 లక్షలు ఇవ్వాలని యువకుడిని డిమాండ్ చేసింది. దీంతో యువకుడు పోలీసులకు సమాచారం చేరవేశాడు. 
 
ఆ తర్వాత పోలీసులు చెప్పినట్టుగా నారాయణ్ సింగ్ సర్కిల్‌లో రెండు లక్షల రూపాయలు ఇస్తున్న సమయంలో పోలీసులు హుటాహుటిన అక్కడకు వచ్చి కళాశాల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి 27 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై యువకుడిని బ్లాక్ మెయిలింగ్ చేసిన యువతిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు.