ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్ల వల్ల బెంగుళూరు నగరంలో జనవాసం పేరిగిపోతోందన్నారు. బెంగుళూరు ఐటీ కంపెనీల్లో ఆంధ్రా యువతే అధిక సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారని, ఈ కారణంగానే ఇక్కడ జనావాసం పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖపట్టణంలో అదానీ, ఎయిర్ టెల్, గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటుకానుండటంపై ఆయన స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వం రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకంతో పాటు రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్మెంట్ చేసిందన్నారు. కేటాయించిన భూమి 25 శాతం, నీళ్ల టారిఫ్లో 25 శాతం రాయితీ ఇచ్చారన్నారు. అలాగే, ట్రాన్స్మిషన్లో 100 శాతం ఉచితంగా కల్పించనుందన్నారు. ఇన్నవీ వాళ్లు బహిర్గతం చేయరని, గూగుల్ వచ్చిదని మాత్రమే ప్రచారం చేస్తారన్నారు.
పైగా, బెంగుళూరులో జనావాసం ఎక్కువై పోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం వల్లే జనవాసం ఎక్కువైపోతోందని ఆయన సెలవిచ్చారు. పైగా, నారా చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఒక్కసారైనా ఆంధ్రావాళ్లు ఉద్యోగాల కోసం బెంగుళూరుకు ఎందుకు వెళుతున్నారు అని అడిగారా అని ప్రశ్నించారు.