శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:51 IST)

ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం, ఆ తరువాత?

సాఫీగా సాగిపోతున్న కాపురం, ఇద్దరు పిల్లలు. ఆప్యాయంగా చూసుకునే భర్త. అడిగిన వెంటనే స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇంకేముంది ఫేస్‌బుక్ క్రియేట్ చేసింది. అందులో ఫ్రెండ్స్ అంటూ యాడ్ అయ్యారు. అందులో ఒక యువకుడు చెప్పిన మాయమాటలను నమ్మింది. చివరకు పచ్చటి కాపురాన్ని కూల్చుకోవడమే కాదు తన ప్రాణాన్ని కోల్పోయింది.
 
ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా చాపియా చెతన్యాకు చెందిన జాకీ అక్తర్ ముంబయిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మూడేళ్ళ క్రితం సిక్కింలోని గ్యాంగ్ చుంక్‌కు చెందిన దవా పస్సీ శెర్పా అనే వివాహిత పరిచయమైంది. ఆమెకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఫేస్ బుక్ పరిచయం కాస్త చివరకు శెర్పా జీవితాన్ని మార్చేసింది. యువకుడు తన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని.. నిన్ను పెళ్ళి చేసుకుంటాను వచ్చేయమంటూ ఫోన్లో పదేపదే చెప్పేవాడు. దీంతో ఆమె నమ్మింది. ముంబైకు వెళ్ళిపోయింది. తన స్నేహితుడి గదిలో ఉంచి రెండు నెలల పాటు ఆమెతో సహజీవనం చేశాడు అక్తర్. అయితే పెళ్ళి చేసుకుందామని శెర్పా పట్టుపట్టింది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు.
 
తన శారీరక వాంఛ తీర్చుకున్న తరువాత ఇక ఆమె అనవసరమనుకున్నాడు. ఎలాగైనా చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు. తమ్ముడు సహాయంతో ఆమె గొంతు నులిమి అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.