శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: బుధవారం, 31 జులై 2019 (13:29 IST)

అక్క మొగుడిపై మోజు... సొంత అక్కనే పొడిచి చంపేసిన చెల్లెలు....

ఆమెకి అక్క మొగుడుపై మోజు కలిగింది. అంతే.. అక్కను అడ్డు తొలగించుకుంటే తనకు బావ సొంతమవుతాడని భావించింది. దానితో ఎలాగైనా అక్కను హత్య చేయాలని పలుసార్లు ప్రయత్నాలు చేసింది. చివరికి ఆమె ప్రయత్నాలు వరుసగా విఫలం కావడంతో ఏకంగా కత్తి తీసుకుని అక్కను విచక్షణారహితంగా గొంతుపైన పొట్టపైన పొడిచి చంపేసింది. 

ఆ సమయంలో బాధితురాలు ఆర్తనాదాలు చేయడంతో ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వచ్చి చూస్తే రక్తపు మడుగులో బాధితురాలు పడి వుంది. అక్కను పొడిచిన చెల్లి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా వారంతా కలిసి ఆమెను పోలీసులకి అప్పగించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కైత్రాలో 27 ఏళ్ల అభిలాషకు గత కొన్ని నెలల క్రితం వివాహమైంది. ఆమె చెల్లెలు 19 ఏళ్ల షతక్షి వీలుచిక్కినప్పుడల్లా అక్క ఇంటికి వెళ్తూ వుండేది. ఈ క్రమంలో ఆమె తన బావపై మోజు పడింది. బావను పెళ్లాడాలని డిసైడ్ అయ్యింది. ఐతే అక్క వుండగా అది సాధ్యం కాదని అనుకుని ఎలాగైనా అక్కను చంపేయాలని ప్లాన్ చేసుకుంది.
 
ఈ క్రమంలో అక్కకు గర్భం రావడంతో పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఇక అదే అదనుగా భావించిన సోదరి... ఆమెను హత్య చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించింది. చివరికి బాత్రూంకి వెళ్లిన సమయంలో కత్తి తీసుకుని ఆమెపై దాడి చేసింది. కనీసం అక్క గర్భవతి అనీ, ఆమె కడుపులో మరో ప్రాణి వుందన్న జాలి కూడా లేకుండా కత్తితో పొడిచి చంపేసింది.