శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 29 జులై 2019 (13:22 IST)

సహజీవనం చేస్తున్న ప్రియుడు ముందే అతడి ప్రియురాలికి యువకుడు ఫోన్.. కత్తితో పొడిచి పరార్

తన కళ్ల ముందే గల్ప్‌లో ఉంటున్న ప్రియురాలికి ఫోన్లో మాట్లాడటంతో అనుమానం వచ్చి ఓ యువకుడిని హత్య చేసిన ఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో జరిగింది. మొగల్తూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ, రోజారమణి గత  కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 
 
ఇదిలావుండగా గత కొన్నాళ్ల క్రితం బాలాజీ అనే యువకుడుని తన దూరపు బంధువని శివరామకృష్ణకు పరిచయం చేసింది రోజారమణి. అయితే బాలాజీ తన భార్య సన్నిహితంగా ఉంటోందని శివరామకృష్ణకి అనుమానం కలిగింది. ఇదే విషయంపై పలుమార్లు బాలాజీని హెచ్చిరించాడు శివరామకృష్ణ. అయితే  రోజారమణిని ఉపాధి నిమిత్తం గల్ప్‌కు పంపించాడు శివరామకృష్ణ.
 
అయినప్పటికీ బాలాజీ ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు అనుమానం రావడంతో మద్యం తాగుదామని పిలిచి మద్యం షాపులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరూ మద్యం తాగుతుండగా బాలాజీ యధాప్రకారం శివరామకృష్ణ ప్రియురాలికి ఫోన్‌ చేసి ఆమెతో చనువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతే... అది తనకు అవమానంగా భావించిన శివరామకృష్ణ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచి  పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.