1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (09:11 IST)

జువెలరీ షాపులో దొంగతనం.. గర్భవతి అయినా రిమాండ్..

చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని దొంగతనానికి పాల్పడిన గర్భవతి రిమాండ్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే..  రజనీ శర్మ అనే 24ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఫతేగఢ్ సాహిబ్ లో నివసిస్తోంది. ఆ జంటకు ఇప్పటికే నాలుగేళ్ల బాబు ఉండగా, ఆమె మరోసారి గర్భం దాల్చింది.

వాళ్లకు సహాయంగా రజనీ తమ్ముడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. మొన్న అక్టోబర్ 9న లూథియానా సిటీకి వచ్చిన రజనీ శర్మ.. ఓ జువెలరీ షాపులో దొంగతనానికి పాల్పడింది. సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఫిర్యాదు చేయగా, నాలుగు రోజులు గాలించి ఆమెను పట్టుకున్నారు పోలీసులు.
 
చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని రజనీ దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు, ఆమె నుంచి రికవరీ చేసిన నగలను సాక్ష్యాలుగా నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా, తన భర్త రోజు కూలీ అని, అతను తెచ్చిచ్చే డబ్బులతో ఇల్లు గడవటం లేదని, అనివార్య పరిస్థితుల్లోనే జువెలరీ షాపులో దొంగతనం చేయాల్సి వచ్చిందని నిందితురాలు జడ్జిగారికి వివరించింది. 
 
అయితే కోర్టువారు ఈ కథలకు కరిగిపోలేదు. పేదరికాన్ని సాకుగా చెబితే, ఈ దేశంలో నూటికి నలభై మంది పేదలే కదాని ప్రాసిక్యూటర్ వాదించారు. చివరికి ఆమె రిమాండ్ విధించిన కోర్టు.. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రజనీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆమెతోపాటు దొంగతనంలో పాలుపంచుకున్న తమ్ముడిని జువెనైల్ హోంకు తరలించారు.