1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (14:02 IST)

హల్దీ వేడుక తర్వాత స్నానానికి వెళ్లి శవమైన కనిపించిన వధువు

woman constable
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. శుభకార్యంలో భాగంగా హల్దీ వేడుక తర్వాత స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు శవమై కనిపించింది. దీంతో ఈ వివాహానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన మున్నీదేవి కుమార్తె గీత.. ఈమె ముజఫర్‌ నగర్‌లోని ఓ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈమెకు ఈ నెల 7వ తేదీన బులంద్‌షెహర్‌కు చెందిన సుమిత్‌తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు కాళ్ళుచేతులు, ముఖానికి పసుపు పూశారు. ఈ వేడుక తర్వాత ఆమె స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లారు. 
 
ఆ తర్వాత ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపుకొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి శబ్దం లేదన స్పందన లేకపోవడంతో అనుమానించిన పోలీసులు.. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా, గీత బాత్రూమ్‌లో అచేతనస్థితిలో కిందపడివుంది. ఆ వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.