గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జూన్ 2025 (14:57 IST)

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

Honeymoon murder case
మేఘాలయ హనీమూన్‌కు వెళ్లిన జంటలో వరుడు హత్య కేసులో తెరపైకి వచ్చిన సంజయ్ వర్మ ఎవరు మిస్టరీని పోలీసులు తేల్చారు. సోనమ్ రఘువంశీ కాల్ డేటాలో సంజయ్ వర్మ అనే వ్యక్తితో అత్యధికంగా మాట్లాడినట్లు తేలగా, ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. తాజాగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ మరెవరో కాదు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని నిర్ధారించారు. 
 
ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా మొబైల్ నంబర్‌ను సంజయ్ వర్మ పేరుతో సోనమ్ సేవ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత కూడా సోనమ్, సంజయ్ అలియాస్ రాజ్ కుశ్వాహాలు ఫోనులో మాట్లాడుకున్నారని, 39 రోజుల వ్యవధిలో 324 సార్లు ఫోన్ చేసుకున్నట్టు తేలింది. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. ఈ హత్యకు రాజ్ కుశ్వాహానే పథకం రచించాడన పోలీసుల స్పష్టం చేశారు. 
 
కాగా, సంజయ్ వర్మ గురించి తనకు తెలియదని సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. ఈ కేసులో సంజయ్ పేరు కూడా వస్తోందని ఇవాళే తెలిసింది అని అన్నారు. రాజా హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్టు పోలీసులు గుర్తించారు.