శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 మే 2021 (15:26 IST)

భార్యపై అనుమానం.. ఒంటిపై 10 కత్తిపోట్లు.. ముంబైలో దారుణం

భార్యపై అనుమానంతో ఓ భర్త పాశవికంగా ప్రవర్తించాడు. భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని తూర్పు కందివాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేష్ సోని అనే వ్యక్తి డైమండ్ పాలిషింగ్ యూనిట్‌లో పని చేసేవాడు.
 
భార్య పూనమ్, కొడుకు శివసోని, ఇద్దరూ కూతుళ్లతో కలిసి తూర్పు కందివాలి పరిధిలోని లోపాయిసర్ సమీపంలో క్రాంతినగర్‌లో నివసిస్తున్నాడు. మహేష్‌కు, తన భార్య పూనమ్ ప్రవర్తన పట్ల గత కొంతకాలంగా అనుమానం పెరిగింది. ఈ కారణంగా తరచూ భార్యాభర్తలు గొడవ పడసాగారు. కొన్నేళ్లుగా ఉద్యోగం కూడా పోవటంతో…. కొడుకు శివసోని సంపాదన మీదే కుటుంబం గడుస్తోంది.
 
శనివారం ఇంట్లో ఉన్న మహేష్ భార్యతో గొడవకు దిగాడు. ఆమెను ఇంట్లోని గదిలోకి తీసుకు వెళ్లి దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి వారికి సర్ది చెప్పబోయారు. 
 
మహేష్ వారిని చంపేస్తాననని బెదిరించటంతో వారు వెనక్కి తగ్గారు. కాసేపటి తర్వాత వారు వెళ్లగానే గది తలుపులు వేసిన మహేష్ కత్తితో భార్యను పాశవికంగా పొడిచి హత్య చేశాడు.
 
గొడవ సర్దుమణిగాక అటువైపు వచ్చిన పొరుగువారు రక్తపు మడుగులో పడి ఉన్నపూనమ్ మృతదేహం చూసి నిశ్చేష్టులయ్యారు. ఆమె కుమారుడు శివసోనీకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన శివ సోనీ పోలీసులకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు.
 
పూనమ్ ఒంటిపై 10 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా తన తండ్రి నిరుద్యోగి గా ఉన్నాడని… ఈ మధ్య కాలంలో మహేష్ సోనీ తన కూతుళ్లు ఒంటిమీద బంగారాన్ని కూడా దొంగతనం చేసినట్లు కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.