1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (15:32 IST)

ఉత్తర కాశీని వీడి కట్టుబట్టలతో వెళ్లిపోతున్న భారతీయ ముస్లింలు... ఎందుకు?

muslims
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో మతపరమైన ఉద్రిక్తలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఓ హిందూ యువతిని ఇద్దరు ముస్లిం యువకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి ఉత్తర కాశీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికితోడు ఈ ప్రాంతంలోని ముస్లింలతా పట్టణాన్ని వదిలి వెళ్లాలంటూ ఓ ప్రత్యేక హిందూ సంఘం ఆదేశించింది. దీంతో ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తూ వచ్చిన ముస్లింలు ఒక్కసారిగా అక్కడ నుంచి కట్టుబట్టలతో పట్టణాన్ని వీడటం మొదలుపెట్టారు. 
 
పైగా, ఈ నెల 15వ తేదీ నాటికి ఉత్తరకాశీలోని ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఒక ప్రత్యేక హిందూ సంఘం ఆదేశాలు జారీచేసింది. బీజేపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ జాహిద్ కూడా తన కుటుంబంతో కలిసి పట్టణాన్ని విడిచిపోయారంటే అక్కడి పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈయన కుటుంబం గత 25 యేళ్లుగా అక్కడే ఉంటూ వచ్చింది. తన షాపులో ఉన్న వస్తువులన్నీ తీసుకుని డెహ్రాడూన్ వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరో ఆరు కుటుంబాలు కూడా షాపులు ఖాళీ చేసి వెళ్లిపోయాయి.