మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్...

flight
రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానంలో ప్రయాణించిన ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణంలో అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నట్టు ప్రకటించడమేకాకుండా, ప్రయాణ ఛార్జీని మొత్తం రీఫండ్ చేస్తామని తెలిపింది. ఇటీవల ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇటీవల రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయంతెల్సిందే. 
 
అయితే, ఆ తర్వాత మరో ప్రత్యేక విమానాన్ని పంపించారు. ఆ విమానం కూడా అక్కడకు చేరుకునేందుకు ఆలస్యమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎయిరిండియా ఈ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. పైగా, వారి ప్రయాణ చార్జీని రిఫండ్ ఆఫర్ ప్రకటించింది. 
 
"మిమ్మల్ని శాన్‌ఫ్రాన్సిస్కోకు చాలా ఆలస్యంగా తీసుకెళ్లినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఇబ్బంది ఎదురైంది. అత్యవసర పరిస్థితుల్లో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాం. మిమ్మల్ని తరలించేందుకు మరో ప్రత్యేక విమానం పంపించినప్పటికీ అది కూడా ఆలస్యం అయింది. మీ సహనానికి ఎప్పటికీ రుపణపడి ఉంటాం. గతాన్ని మేం మార్చలేమని, కానీ, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇందుకుగాను మీ ప్రయాణినికి పూర్తి రీఫండ్ ఇస్తామని, భవిష్యత్తులో మా విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్ వోచర్ కూడా ఇస్తున్నామని" తెలిపింది.