గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:33 IST)

చీఫ్ జస్టిస్ తల్లిని మోసం చేసిన ఫ్యామిలీ కేర్‌టేకర్!

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్ఏ బాబ్డే విధులు నిర్వహిస్తున్నారు. ఈయన తల్లి ముక్తా బాబ్డే. ఈమెను ఓ కేర్‌టేకర్ మోసం చేశాడు. అదీ కూడా 2.5 కోట్ల రూపాయలుకు టోకరా వేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆకాశవాణి కేంద్రం సమీపంలో బోబ్డే కుటుంబానికి ఒక పంక్షన్‌ హాల్‌ ఉంది. అది ముక్తా బోబ్డే పేరు మీద ఉంది. దానికి పదేళ్లుగా తపస్ ఘోష్ (47) అనే వ్యక్తి కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
దానికి వచ్చే అద్దెను ఆయన బోబ్డే కుటుంబానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే, ముక్తా బోబ్డే వృద్ధాప్యం, ఆమె అనారోగ్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఆమెకు అతడు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి డబ్బులు కాజేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఫంక్షన్ హాల్‌కు భారీగా బుకింగ్‌లు వచ్చి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.
 
దీంతో, డబ్బులు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వడంలో తపస్ ఘోష్ జాప్యం చేశాడు. ఈయన చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను అరెస్టు చేశారు. ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సీజేఐ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్‌ మోసం చేశాడన్న కేసులో విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.