శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (10:09 IST)

శోభనం మూడు రాత్రులు ముగిశాక పత్తాలేకుండా పారిపోయిన వరుడు..?

ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ శోభనం మూడు రాత్రులు ముగిసిన తర్వాత పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోటే తాలూకాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని హొసకోటె తాలూకాలోని నందగుడి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన అదే గ్రామానికి చెందిన అనూజా అనే యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరిద్దరూ మూడు రోజుల ఓ ఇంట్లో గడిపిన తర్వాత ఆ తరువాత ప్రమోద్ కనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.