1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:32 IST)

భారతీయ పాటలకు లిప్ సింక్ చేస్తూ పాపులర్.. కిలీ, నీమాలకు ప్రధాని కితాబు

Modi
భారతీయ పాటలకు లిప్ సింక్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాంజానియా సోషల్ మీడియా సెలెబ్రిటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతీయ పాటలకు లిప్ సింక్ చేసే కిలీ, నీమా అనే టాంజానియా సోషల్ మీడియా సెలెబ్రిటీల ప్రయత్నాలను మోదీ ఆదివారం తన మన్ కీ బాత్ ప్రసంగంలో అభినందించారు. 
 
ఈరోజు నెలవారీ రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 86వ ఎపిసోడ్‌ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “మిత్రులారా, భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ, భారతీయ సంగీత మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇంకా నేను మన్ కీ బాత్‌లో మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు, కిలీ పాల్, అతని సోదరి నిమా, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా వార్తల్లో ఉన్నారు. మీరు కూడా వారి గురించి తప్పక విని ఉంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా కిలీ పాల్‌కు సన్మానం జరిగినట్లు ప్రధాని పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. కిలీ, నీమాలు భారతీయ సంగీతం పట్ల అభిరుచి కారణంగా వారు బాగా ప్రాచుర్యం పొందారు. భారతీయ పాటలకు లిప్ సింక్ చేస్తూ వీరిద్దరూ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా వీరు మన జాతీయ గీతం జన గణ మన పాడిన వీడియో వైరల్‌గా మారింది. ఇకపోతే.. ఇటీవల మరణించిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు కూడా ప్రధాని నివాళులర్పించారు.