అటు నుంచి బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి బాంబు వెళ్లాలి : సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు!!
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి శత్రుదేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇకపై ఏమాత్రం ఉపక్షించాల్సిన అవసరం లేదని, అటు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి బాంబు వెళ్లాలని భారత సైన్యాధిపతులకు ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ సైన్యం, వారి ప్రేరేపిత ఉగ్రమూకల కాల్పులకు ధీటైన సమాధానం ఇవ్వాలని ఆయన దేశ త్రివిధ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. తూటాకు తూటానే సమాధానం అనే రీతిలో మన ప్రతిస్పందన ఉండాలని స్పష్టం చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.
ఆ వార్తా సంస్థ కథనం మేరకు.. అక్కడ నుంచి ఒక తూటా పేలితే, ఇక్కడ నుంచి బాంబు వెళ్ళాలి. సరిహద్దు నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగగబడితే భారత బలగాలు మిస్సైళ్ళతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. వారు కాల్పులు ప్రారంభిస్తే మనం రెట్టింపు స్థాయిలో కాల్పులు జరపాలి. వారు దాడి చేస్తే మనం మరింత శక్తివంతంగా ప్రతిదాడి చేయాలి అని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జారీచేసిన తాజా కీలక ఆదేశాలతో భారత సాయుధ బలగాలు సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికైనా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)పై భారత వైఖరి, ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు వంటి పరిణామాల పాకిస్థాన్కు స్పష్టమైన సందేశాన్ని ఇస్తూనే, ప్రధాని మోడీ సాయుధ బలగాల అధిపతులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.