శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (16:47 IST)

రేసింగ్ అభిరుచి గల బాలుడికి సైకిల్ కొనిచ్చిన రాష్ట్రపతి కోవింద్

లక్ష్యసాధనకు ప్రోత్సాహం అవసరం. ఢిల్లీకి చెందిన రియాజ్ అనే బాలుడు సైకిల్ రేసింగ్‌లో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటూ ప్రతి రోజు విద్యతో పాటు రేసింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. రియాజ్‌కు చాంపియన్‌గా నిలవాలనే కోరిక. దీంతో కఠోర సాధన చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆ బాలుడికి రేసింగ్ సైకిల్‌ను కానుకగా కొని ఇచ్చారు.
 
రియాజ్ ఢిల్లీ లోని సూర్యోదయ బాలవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. రియాజ్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు రేసింగ్‌కు అవసరమైన డబ్బు కోసం హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రపతి దృష్టికి వచ్చింది. దీనితో రాష్ట్రపతి ఆ బాలుడికి అతి ఖరీదైన రేసింగ్ సైకిల్ కొని ఇచ్చి ప్రోత్సహించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశీర్వదించారు.