Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025పై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. ఇది "బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం" లాంటిదని పేర్కొన్నారు.
ప్రభుత్వం "దివాలా తీసిన ఆలోచన"ను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. "ఈ బడ్జెట్ బుల్లెట్ గాయాలకు కట్టు లాంటిది. ప్రపంచం అస్థిరతను ఎదుర్కొంటోంది. అలాంటి సమయాల్లో, భారతదేశం తన ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. అయితే, ప్రభుత్వం దివాలా తీసిన ఆలోచనలో నిమగ్నమై ఉంది" అని ఆయన రాశారు.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడ్జెట్ను ప్రశంసించారు. ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు ప్రతిబింబమని అభివర్ణించారు.