1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (08:58 IST)

ప్రేమను నిరాకరించిందనీ నిప్పుపెట్టిన సైకో లవర్

fire accident
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో శనివారం తెల్లవారుజాను ఓ భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం విద్యుదాఘాతం వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. 
 
ఆ భవనంలో నివసించే ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనందుకుగాను ఓ యువకుడి భవనానికి నిప్పుపెట్టినట్టు తేలింది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన సైకోను శుభం దీక్షిత్ (27)గా గుర్తించారు. శనివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న ఈ యువకుడు అక్కడ పార్క్ చేసిన స్కూటర్‌కు నిప్పుపెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో చెలరేగి అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకున్నాయి. అక్కడ నుంచి భవనానికి వ్యాపించాయి. 
 
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అందులోని కొందరు కిందకు దూకి ప్రాణాలు కోల్పోగా ఐదుగురు మాత్రం మంటల్లో కాలిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరంపై స్థానిక పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.