శబరిమలపై ఇక మహిళలకు ప్రవేశం.. కేరళ ప్రభుత్వం ప్రకటన
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలపై కేరళ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అయ్యప్ప భక్తులు పోటెత్తే శబరిమలలో.. మహిళలు గర్భగుడిలోకి ప్రవేశించవచ్చంటూ తేల్చి చెప్పింది. ప్రభు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలపై కేరళ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అయ్యప్ప భక్తులు పోటెత్తే శబరిమలలో.. మహిళలు గర్భగుడిలోకి ప్రవేశించవచ్చంటూ తేల్చి చెప్పింది. ప్రభుత్వ ప్రకటనతో మహిళా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ గత కొన్నేళ్లు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మహిళ డిమాండ్ ఆలయ నిబంధనలకు వ్యతిరేకమంటూ ఇంతకాలం వారి డిమాండ్ను పక్కనబెట్టిన ప్రభుత్వం.. ప్రస్తుతం మహిళలు శబరిమలకు వెళ్ళొచ్చునని ప్రకటించడం వివాదానికి ఫుల్స్టాప్ పెట్టినట్లైంది. కాగా పది సంవత్సరాల్లోపు గల బాలికలు 50 ఏళ్లకు పైబడిన మహిళలకు శబరిమలపై ప్రవేశించే అర్హత ఉండేది.
నెలసరి సమస్యల కారణంగా మహిళలు శబరికి వస్తే అయ్యప్ప స్వామి బ్రహ్మచారికి పడదని.. తద్వారా అశుభాలు తలెత్తే అవకాశాలున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రస్తుతం శబరిమలకు మహిళల ప్రవేశానికి కేరళ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.