శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (15:11 IST)

కటౌట్లు పెట్టండి.. అలా పాలాభిషేకం చేయండి..

పాల ప్యాకెట్‌తో కాదు.. పెద్ద పెద్ద పాత్రల్లో పాలను నింపి ఆ పాలతో తన కటౌట్‌లకు అభిషేకం చేయించాలని కోలీవుడ్ యంగ్ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ వీడియోలో తన అభిమానులతో శింబు మాట్లాడుతూ.. సినిమా విడుదలయ్యే తొలి రోజున కటౌట్, పాలాభిషేకం వద్దని చెప్పాడు. 
 
అయితే శింబుకు ఒకరిద్దరే ఫ్యాన్స్ వున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ఇందుకు కౌంటర్‌గా శింబు మాట్లాడుతూ.. తనకున్న ఒకరిద్దరు ఫ్యాన్స్ కటౌట్లు పెట్టాలని.. పెద్ద పెద్ద కుండీలతో పాలాభిషేకం చేయించాలని శింబు తెలిపాడు. 
 
ప్రస్తుతం శింబు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు కటౌట్లు వద్దని, పాలాభిషేకం అస్సలొద్దన్న శింబు.. దానికి బదులు తల్లిదండ్రులకు మంచి దుస్తులు కానుకగా ఇవ్వండంటూ చెప్పుకొచ్చారు. కానీ శింబుకున్న ఫ్యాన్స్ చాలా తక్కువని.. శింబుకు ఎందుకు ఈ రద్దాంతం అంటూ సెటైర్లు విసిరారు. 
 
ఈ సెటైర్లకు శింబు కౌంటరిస్తూ.. తనకు కటౌట్లు పెట్టాలని.. భారీ పాత్రలతో పాలాభిషేకం చేయాలన్నారు. ప్రస్తుతం శింబు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా శింబు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.