1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (11:21 IST)

ఆరేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడి అత్యాచారం.. కళ్లారా చూసిన తండ్రి

ఆరేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనపూరుకు చెందిన ఓ బాలిక ఒకటో తరగతి చదువుతోంది. కార్తీకమాసం కావడంతో ప్రతిరోజూ సాయంత్రం గుడికి వెళ్లి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కూడా ఆలయానికి వెళ్లింది. 
 
అయితే, సాయంత్రం 6.30 అయినా కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే బాలిక తండ్రి.. కూతుర్ని వెతుక్కుంటూ వెళ్లాడు. గ్రామంలోని రైస్ మిల్లు వద్ద ఖాళీస్థలంలో పాప మీద అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు లైంగికదాడి చేస్తున్నాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన తండ్రి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పరిగెత్తుకుంటూ పారిపోయాడు. 
 
రక్తస్రావంతో ఉన్న బాలికను తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఆర్ఎంపీ డాక్టర్ నిర్ధారించాడు. దీంతో బాధితురాలి తండ్రి పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.