1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 3 మే 2025 (14:06 IST)

గోవా శిర్గావ్ ఆలయంలో నిప్పులపై నడుస్తూ తోసుకున్న భక్తులు, ఏడుగురు మృతి

walk on fire
గోవాలోని శ్రిగావ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీ లైరాయి దేవి జాతరలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను గోవా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తొక్కిసలాటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అలాగే, మృతులను కూడా గుర్తించాల్సివుంది. 
 
శ్రీ లైరాయి దేవి జాతరను ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు గోవా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తుంటారు. లైరాయి దేవిని పార్వతీదేవి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ పండుగలో సంప్రదాయ ధోండాచిలో భాగంగా, వేలాది మంది భక్తులు పాదరక్షకులు లేకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. ఈ వేడుకలో సంప్రదాయ డప్పుచప్పుళ్లు, భక్తిగీతాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది.