1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:26 IST)

రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యం: నిర్మల బడ్జెట్లో మర్మం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ .. ఈ ఏడాది జరగునున్న వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల నేపథ్యంలో తీసుకువస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు లక్ష్యంగా ఆ రాష్ట్రాల్లో మౌళిక సదుపాయల ప్రాజెక్ట్‌కు అధికంగా నిధులు కేటాయించారు...
 
- భారత్‌ మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,
- అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి,
- కేరళలో 1100 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,
- కేరళకు రూ. 65 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- బెంగాల్‌లో 95 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- తమిళనాడులో 3500 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ,
- ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.110 లక్షల కోట్లు..
- 2023 నాటికల్లా రైేల్వే లైన్ల విద్యుద్దీపకరణ పూర్తి
- మెట్రో నెట్‌ వర్క్‌ అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు,
- కొచ్చి, చెన్నై, నాగ్‌పూర్‌, బెంగళూరు మెట్రో విస్తరణకు నిధులు
- విజయవాడ, ఖరగ్‌పూర్‌ మధ్య ఈస్ట్‌కోస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌
- ఇటార్సీ, విజయవాడ మధ్య నార్త్‌ఈస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌