1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:23 IST)

ఆర్డర్ డిలేః రెస్టారెంట్ ఓనర్‌నే చంపేసిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్

స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్ ఓ రెస్టారెంట్ ఓనర్‌నే చంపేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆర్డర్ ఆలస్యమైన కారణంగా అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ డెలివరీ ఏజెంట్ కోసం గాలిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. సునీల్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని మిత్రా సొసైటీలో జామ్ జామ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆర్డర్‌ను పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు వచ్చాడు.
 
ఒక ఆర్డర్‌ను వెంటనే ఇచ్చిన రెస్టారెంట్‌లో పని చేసే వ్యక్తి.. మరో ఆర్డర్ లేటవుతుందని చెప్పాడు. దీంతో సదరు ఏజెంట్ ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవను అడ్డుకోబోయిన యజమాని సునీల్‌ను ఆ స్విగ్గీ డెలివరీ బోయ్ కాల్చాడు. 
 
వెంటనే సునీల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినా.. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ డెలివరీ ఏజెంట్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వాళ్లు అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.