1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (13:07 IST)

చేతికి సెలైన్... నోటికి ఆక్సిజన్... ఓ ధైర్యమైన గుండె ఆగిపోయింది..

ఢిల్లీకి చెందిన ఓ యువతి కోవిడ్ వైరస్ బారినపడినప్పటికీ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. చేతికి సెలైన్ పేపు, నోటికి ఆక్సిజన్ పైపుతో ఒకవైపు కోవిడ్ రోగులు.. మరోవైపు కోవిడ్ మృతుల మధ్య ఉంటూ కూడా ధైర్యంగా కరోనా చికిత్స చేయించుకుంది. అలాంటి ధీరవనిత గుండె ఆగింది. ఆమెకు కోవిడ్ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స చేస్తూ వచ్చిన వైద్యురాలు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చేతికి సెలైన్ ఎంచుకుంటూ, నోటికి ఆక్సిజన్ పైపు తగిలించుకుని కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందిన 30 యేళ్ళ యువతి... ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాటలు వింటూ ఆనందంగా కనిపించింది. 
 
'లవ్ యూ జిందగీ' పాట వింటూ ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుంటున్న వీడియోను ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనిక గత వారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఎంత మందిలో స్ఫూర్తి నింపింది. 
 
అయితే ఆమె ధైర్యం కరోనా ముందు ఓడిపోయింది. పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో ఆమె గుండె ఆగిపోయింది. గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. 'చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం' అంటూ మోనిక ఆమె మరణ వార్తను తెలియజేశారు. దీంతో ఎంతో మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు.