1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (11:53 IST)

కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు... ఆరు విగ్రహాలను చోరీ చేశారట

కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన

కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన్ని ఆయన ఇంట్లో పనిచేసేవారిలో ఒకరు గుర్తించి తెలిపారు. ఈ భవనం మెయిన్‌ రోడ్డులోనే ఉండటంతో, ప్రహరీ ఎక్కి లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీధుల్లో తిరిగేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారని, వాళ్లకు ఇక్కడకు సమీపంలోని సాయి ఆలయం వాళ్లు వారికి దుస్తులు ఇస్తారని, అందుకే ఇక్కడ తిరుగుతూ దొంగతనాలు చేస్తారని చెప్పారు.
 
చోరీకి పాల్పడిన దొంగలు థరూర్ ఇంటి సమీపం నుంచి ఒక ప్రకటన బోర్డుతో పాటు.. ఆరు విగ్రహాలు, ఒక యాంటిక్ పీస్‌తో పాటు రాగి కళ్లజోడును చోరీ చేసినట్టు తెలిపారు. ఇంతకుముందు కూడా విగ్రహాలు చోరీచేసిన ఒక గ్యాంగ్ హస్తాన్ని అనుమానిస్తున్నట్లు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. మెయిన్‌గేటు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయని థరూర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. రోడ్డుమీద ఉన్న ఫుట్‌పాత్ నుంచి ప్రహరీ ఎక్కడం చాలా సులభమన్నారు. ఈ చోరీపై పోలీసులు తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.