గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (19:32 IST)

వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. మఫ్టీలో పోలీసులు?

తమిళనాడు రాజధాని చెన్నైలోని వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరిగిన గుట్టును రట్టు చేశారు.. పోలీసులు. చెన్నై వేలచ్చేరిలోని బేబీ నగర్‌లో ఓ మసాజ్ సెంటర్‌ నడుస్తోంది. ఇటీవల వేకువజామున ఈ మసాజ్ సెంటర్ నుంచి గుంపులు గుంపులుగా పురుషులు, మహిళలు బయటికి రావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఈ సమాచారం మేరకు పోలీసులు మఫ్టీలో మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ మసాజ్ సెంటర్‌పై కన్నేశారు. ఆపై మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని.. సత్య, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వ్యభిచార రొంపిలో దిగిన ఇద్దరు భారత మహిళలను పోలీసులు విడిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.